మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఏసీబీ సోదాల్లో ఆయనకు సూర్యాపేటలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.
ఐదు ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు, హైదరాబాద్లో కమర్షియల్ భవనం, కిలో బంగారు నగలు, 29 మద్యం సీసాలు, బ్యాంకు ఖాతాలో రూ.3.83 లక్షలున్నట్లు గుర్తించారు.
సోదాల్లో రూ.5.92 కోట్ల విలువైన సొత్తును గుర్తించారు.










