ఇంట్లో దుర్వాసన.. చూస్తే మగ్గాల నిర్వాహకుడి మృతదేహం.

0
0

గురువారం మదనపల్లె నీరుగట్టుపల్లిలోని ఓ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసనతో పరిశీలించగా, మగ్గాల నిర్వాహకుడు జయరాం (37) ఉరేసుకుని మృతి చెందినట్లు టౌన్ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. రాయచోటికి చెందిన జయరాం, తన భార్యతో గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని, దీంతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.