ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
✅ “ప్రకృతి మనకు జీవనాధారం, స్ఫూర్తి, భవిష్యత్తుకు మార్గదర్శకం. నేడు వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి” అని ఒక సందేశంలో పేర్కొన్నారు.
✅ ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్నచిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన భూమిని అందించగలవని పేర్కొన్నారు.
✅ కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్-జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
#NowForClimate #ForOurFuture #InspiredByNature #WorldEnvironmentDay










