పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు కాలనీ సమీపంలోని పిక్నిక్ స్పాట్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన సబ్బవరపు ఆనంద్ సీలేరు నదిలో మునిగి మృతి చెందారు. మూడు కుటుంబాలకు చెందిన 13 మంది మూడు కార్లలో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చారు.
ఈ క్రమంలో సీలేరు నది వద్ద నదిలో దిగి స్నానాలు చేస్తూ ఉండగా నీటి ప్రవాహంలో మృతుడు ఆనంద్ మరియు మరో కుటుంబానికి చెందిన బాబు చిక్కుకోగా కొద్ది దూరంలో ఉన్న స్థానికుడు గుర్తించి వెంటనే స్పందించి బాబుని సురక్షితంగా కాపాడగా, ప్రమాదవశాత్తూ మృతుడు నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పత్తేపురంలో విద్యుత్ శాఖలో లైన్మ్యాన్గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చింతూరు పోలీసులు.
# Yadagiri










