బాలాజీ నగర్‌లో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బండి రమేష్ పాదయాత్ర

0
0

బాలాజీ నగర్‌లో బండి రమేష్ విస్తృత పాదయాత్ర

కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ విస్తృత పాదయాత్ర నిర్వహించారు. కాలనీల్లో పర్యటిస్తూ డ్రైనేజీ, రోడ్ల దుస్థితిపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

గత పదేళ్లలో అభివృద్ధి జరగలేదని విమర్శిస్తూ, అపోలో ఫార్మసీ ఎదురుగా రోడ్డు విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. కోటి నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అధికారులతో చర్చించి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.