పుంగనూరు: 136 పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ

0
0

పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, పుంగనూరు పరిధిలోని 136 పాఠశాలలకు ఎస్.ఆర్.కె. కిట్లతో పాటు పుస్తకాల పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి పర్యవేక్షణలో ఈ పంపిణీ జరుగుతోంది. 1, 5, 10వ తరగతులకు సంబంధించిన టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ పూర్తి స్థాయిలో అందగా, 6, 9వ తరగతులకు సంబంధించిన పుస్తకాలు 50 శాతం మాత్రమే అందాయని, మిగిలినవి పాఠశాల పునః ప్రారంభం రోజుకు వస్తాయని తెలిపారు# కొత్తూరు మురళి .