రణభేరి గంగమ్మ ఆలయ అర్చకులు మృతి

0
0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలోని రణభేరి గంగమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు నాగరాజా (65) శుక్రవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో మరణించారు. కుటుంబ సభ్యులు ఆయనను మదనపల్లె ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆలయంలో వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా ఉన్న ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి .