పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలం సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం: రాధమ్మ

0
0

అన్నమయ్య జిల్లా సోమల మండలం, మిట్టపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ డ్వాక్రా రుణం వడ్డీ వివాదంలో చిక్కుకుంది. తాను లక్ష రూపాయల రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ, వడ్డీ బకాయి ఉందని సంఘమిత్ర, గ్రూపు సభ్యులు తన ఆరు పాడి ఆవులను తోలుకెళ్లారని ఆమె ఆరోపించింది. పోలీసులను ఆశ్రయించినా ఏడాదికాలంగా అవమానాలు తప్పడం లేదని బాధితురాలు వాపోయారు. సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యం అని రాధమ్మ శనివారం తెలియజేశారు# కొత్తూరు మురళి.