పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద శుక్రవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కంటైనర్ తో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన కంటైనర్ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









