శవ రాజకీయాలు కోసమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వస్తున్నారని విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.
జగన్ పర్యటనపై బుధవారం వీడియో విడుదల చేశారు. విశాఖ ఉక్కును వైసీపీ హయాంలో నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం కార్మికులు వైసీపీ హయాంలో పోరాటం చేస్తే పట్టించుకోలేదని విమర్శించారు. శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
#Boiena Rajesh










