గురువారం రాత్రి కర్ణాటకలోని మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుండి మదనపల్లె వస్తున్న SLT బస్సు, మామిడికాయలు అన్లోడ్ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న గంగడు.
కిట్టలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










