గుజరాత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి

0
4

పుంగనూరు ఎన్ఎస్ పేటకు చెందిన 40 ఏళ్ల లారీ క్లీనర్ అక్రమ్, నాలుగు రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజ్జాద్ బాషా స్వల్ప గాయాలతో బయటపడగా, అక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్రమ్ శనివారం మృతి చెందినట్లు ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపారు# కొత్తూరు మురళి.