మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం కాలనీలో విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ విషాద సంఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజల ప్రాణాల భద్రత విషయంలో సంబంధిత శాఖల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ విద్యుత్ లైన్లు, చెట్లు, ప్రమాదకర ప్రాంతాలపై ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
#Sidhumaroju
Alwal










