గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం

0
0

మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు భూమిపూజ చేసారు. దాదాపు రూ.70 కోట్లతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికతతో పాటు సంక్షేమం, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి ఇప్పటికి రూ.2,216 కోట్లు కేటాయించారు. అలాగే రాబోయే గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్ధికి రూ.802 కోట్లు మంజూరు చేశారు,ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు దుద్ధిల్లా శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు ,రాజ్ ఠాకూర్ గండ్ర సత్యనారాయణ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.