మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి, కార్మికుల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం, సింగరేణి కార్మికులకు భరోసా కల్పిస్తూ దేశంలో ఏ సంస్థలో లేని విధంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మెగా కవరేజ్,చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది
అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు తలా రూ. 5,000 బోనస్ద,శాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి కార్మిక సంఘాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు,కార్మికుల హక్కు అయిన మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును తక్షణమే ప్రారంభించేలా ఆదేశాలు,గతంలో కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా అడ్డుపడి సింగరేణికి రూ. వేల కోట్ల నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే! ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ లోలోపల ఒక్కటై ‘దొంగే దొంగ’ అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారు. సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్న ఈ కుట్రలను కార్మికులు గమనించాలి,సింగరేణి సంస్థను ఏ శక్తుల చేతుల్లోకీ వెళ్లనివ్వం. గద్దల్ని, డేగల్ని, దళారుల్ని సింగరేణిలో అడుగుపెట్టనివ్వం సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని అన్నారు.










