అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.|

0
0

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. ఆయన ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని శ్రీ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగే జిల్లా బీజేపీ అధ్యక్షుడు పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం, కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం బెంగళూరుకు బయలుదేరనున్నారు.