నల్లబెల్లి: ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోండి: ఏవో
భారత్ అవాజ్ న్యూస్: 17 జూన్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నల్లబెల్లి, లెంకలపల్లి, రేలకుంట, నందిగామ గ్రామాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని నల్లబెల్లి AO రజిత సూచించారు. ఈనెల 20న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతగా రూ.2,000 జమ కానుండగా, రిజిస్ట్రీ పూర్తి చేసిన వారికే అర్హత ఉంటుందని తెలిపారు. ఈరోజు నల్లబెల్లి రైతు వేదికలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్తో హాజరు కావాలన్నారు…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










