మదనపల్లె జిల్లా వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సైన్స్, కామర్స్ విభాగాలలో 11వ తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గీత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు మార్చి-2026లో నిర్వహించిన CBSE/SSC రాష్ట్ర బోర్డు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు.









