చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కొందరు యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, SC/ST చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దోషులపై కేసులు పెట్టడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, ఒక కులం పేరుతో ఇతర కులాల వారిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని యువత పేర్కొంటున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, తప్పుడు కేసులుంటే నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కులాల మధ్య విభేదాలు పెరగకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.










