అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణపై పోలీసు శాఖ బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్లైన్ 181, శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. లోన్ యాప్లు, నకిలీ లక్కీ డ్రాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలపై వేధింపులు, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల రక్షణకు పోలీసు శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు.










