విద్యుత్ స్తంభం కూలి మహిళకు తీవ్ర గాయాలు.|

0
1

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో బుధవారం పాలెంపల్లె పంచాయతీ సికారిపాలెంకు చెందిన శాంతి (30) తన చంటి బిడ్డతో కలిసి ఆధార్ కార్డు పనిమీద పాలెంపల్లె సచివాలయానికి వెళ్లగా, అక్కడ ఉన్న విద్యుత్ స్తంభం ఆమెపై కూలింది. ఈ ప్రమాదంలో శాంతి కాలుకు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, విద్యుత్ స్తంభాల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.