హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్.|

0
0

ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏఐఎస్ఎఫ్ బుధవారం డిమాండ్ చేసింది. మదనపల్లె కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసనలో, హాస్టల్ విద్యార్థులకు రోజుకు కేవలం రూ. 53 మాత్రమే కేటాయించడం అన్యాయమని, పెండింగ్‌లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేసి, మెస్ చార్జీలను పెంచాలని, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ కోరారు.