కూకట్‌పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ జన్మదిన వేడుకలు|

0
1

కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన  వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సాధికారత కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషిని నాయకులు కొనియాడారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారి అధ్యక్షతన ఏ బ్లాక్ &బి అద్యక్షులు డాక్టర్ పి నాగిరెడ్డి, తూము వేణు ఆధ్యర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, రాహుల్ గాంధీ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, మైనారిటీ నాయకులు, SC సెల్ నాయకులు, BC సెల్ నాయకులు, సేవాదళ్ నాయకులు, సోషల్ మీడియా,కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసారు.

రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నాయకులు ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.