అన్నమయ్య జిల్లా మదనపల్లె రామారావు కాలనీ మున్సిపల్ పార్కులో జిడి తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పదో తరగతి విద్యార్థిని పి.జ్ఞానవి రెడ్బెల్ట్ సాధించి సత్తా చాటింది. చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం తైక్వాండోలో శిక్షణ పొందుతున్న ఆమె, రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి కోచ్ గంగరాజుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ కార్యక్రమంలో జాక్ జావీద్, సుభద్ర, అబు, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.










