విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త రిలే నిరాహార దీక్షల్లో భాగంగా జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్బాషా, ఇబ్రహీంపురం ప్రకాష్ రెడ్డి, నందవరం మండల యువజన అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన తొలి రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా నిర్వహించబడింది.
ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నందవరం మండలంలోని వివిధ గ్రామాల నుండి యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










