శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలోని ఎనమలవారిపల్లెలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తండ్రి, కుమారుడితో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సునీల్ కుమార్, త్రిలోక్ కుమార్ వర్గాల మధ్య భూ వివాదం గొడవకు దారితీసిందని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










