దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, మంగళవారం సాయంత్రం దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, లంకోజనపల్లి గ్రామ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.










