పుంగనూరు మండలం, బర్నేపల్లి గ్రామానికి చెందిన శోభన్ బాబు ఆదివారం చిత్తూరులో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. ఆధార్ కార్డు జిరాక్స్ సరిపోతుందని భావించిన అతడు, పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలియడంతో ఆందోళనకు గురయ్యాడు. చిత్తూరు పోలీసులు స్పందించి, అతడిని నెట్ సెంటర్కు తీసుకెళ్లి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయించి, సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చారు. పోలీసుల సకాలంలో స్పందించడంతో శోభన్ బాబు పరీక్ష రాయగలిగాడు. అతడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు# కొత్తూరు మురళి.










