చింతూరుకు చెందిన కోళ్ల వ్యాపారి.. కోళ్లను లోడ్ చేసుకోవడం కోసం ఒక బొలెరో వ్యాన్ను భద్రాచలం వైపు వెళ్తుండగా. సరిగ్గా ఏడుగురాళ్లపల్లి – కాటుకపల్లి గ్రామాల మధ్యకు రాగానే.రన్నింగ్లో ఉన్న వ్యాన్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. అంతే.. క్షణాల్లో మంటలు వ్యాపించి బండి మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలు చూసి స్థానికులు వెంటనే అలెర్ట్ అయ్యారు. చేతికి దొరికిన నీళ్లతో ఎలాగోలా కష్టపడి మంటలనైతే ఆర్పివేశారు కానీ… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ బొలెరో వ్యాన్ కాస్తా పూర్తిగా కాలి బూడిదైపోయింది. లక్కీగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న చింతూరు ఎస్ఐ (SI) సంతోష్ కుమార్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
# Yadagiri










