డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|

0
8

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. జాతీయ ఐక్యతకు, భారత సమగ్రతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశభక్తి, నిస్వార్థ సేవాభావానికి ప్రతీకగా నిలిచిన మహానేతగా ఆయనను కొనియాడారు.

భారత మాత గొప్ప కుమారుడైన డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని నాయకులు అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రత, జాతీయవాద విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొంటూ వినమ్ర నివాళులు  అర్పించారు.

#Sidhumaroju