మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చీకిలబైలుకు చెందిన శ్రీనివాసులు (33) కళాశాలకు వెళ్తుండగా ఆటో ఢీకొని కాలు విరిగింది. మరో ఘటనలో నారాయణరెడ్డి బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుల దర్యాప్తు చేస్తున్నారు.










