ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యుడిగా తనను ప్రభుత్వం నియమించి నట్లు రాయచోటి పట్టణానికి చెందిన కంటి వైద్యుడు జి. రెడ్డెన్న ఒక ప్రకటనలో తెలిపారు. Apsahpc సభ్యుడిగా మూడేళ్ల పాటు కొనసాగను న్నట్లు తెలి పారు. ఏపీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. రెడ్డెన్న 40 సంవత్సరాలుగా
కంటి వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సురభి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆప్తాల్మిక్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా జిల్లాలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకుచెందిన వేలాది మంది కంటి పరీక్షలు, వైద్య సేవలు అందించారు. వ్యక్తిగ తం తో పాటు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా, అసిస్టెంట్ గవర్నర్గా పనిచేసి కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలను అందించారు. కాగా రెడ్డన్న Apsahpc రాష్ట్రస్థాయి సభ్యుడుగా ఎన్నిక కావడం పట్ల రాయచోటికి చెందిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బందితోపాటు పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.










