అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గురువారం బహుజన సేన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, రాజ్యాంగ హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను ఆయన రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. హోదా కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బహుజన సేన నాయకుడు చందు హెచ్చరించారు.










