పుంగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా నవధాన్యాల అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత నవధాన్యాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










