దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం..
ఈరోజు మార్కాపురం మండల పరిధిలోని చింతగుంట, తిప్పాయపాలెం, కే.కొత్తపల్లి, కోల భీమునిపాడు, నికరంపల్లి, పెద్ద నాగులవరం, గోగులదిన్నె, రాయవరం, నాయుడు పల్లి, పెద్ద యాచవరం, బోడపాడు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి, మన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాను.
ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర ఓటర్ల సర్వే (SIR) ప్రక్రియపై మన శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దొంగ ఓట్ల పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ఎక్కడైనా దొంగ ఓట్లు, అక్రమ చేరికలు ఉంటే వెంటనే గుర్తించి, వాటిని తొలగించడానికి అవసరమైన పక్కా ఆధారాలను స్థానిక బిఎల్ఓ (BLO) లకు సమర్పించి బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాను.
మన ఓటు-మన హక్కు! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంలోనూ, అక్రమాలకు తావులేకుండా చేయడంలోనూ తెలుగుదేశం సైనికులు ముందుండాలి.









