మార్కాపురం జిల్లా రజకుల ఆత్మీయ సమావేశము
తేదీ: 28-06-2026 ఆదివారం సాయంత్రం. 3-00 గo కు
వేదిక: సౌజన్య కన్వెన్షన్ హాల్ కాలేజీ ఎదురుగా. మార్కాపురం
రజక సోదర సోదరీమణులకు నమస్కారము మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రజకుల ఏకైక సమస్య రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుట గురించి. దేశంలో 18 రాష్ట్రాలలోనూ 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకుల ఎస్సీ జాబితా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా ఎస్సీ జాబితాలో చేర్చుటకు అన్ని అర్హత కలిగి ఉన్నాము
గౌరవ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన విన్నపాలు మన్నించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుటకై కమిషన్ వేయడం జరిగినది. వారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు ఎన్నికలు రావడం వలనే ఆగిపోయింది. ప్రస్తుతం మన అదృష్టం వలన కూటమి ప్రజా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది అందులో భాగంగా గుంటూరు-2 శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళ మాధవి శాసన సభ్యురాలు గారికి పార్టీలో అత్యున్నత పదవి పోలిట్ బ్యూరో సభ్యులుగాను మరియు మాజీ శాసన మండల సభ్యులు గౌరవనీయులు శ్రీయుత దువారపు రామారావు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగాను అత్యున్నత పదవి ఇచ్చి ఉన్నారు.
( రజకుల సమస్యలు)
1. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుటకు అధ్యయన కమిటీ
2. రజకులను స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రాతిపదికన అవకాశం కల్పించుట గురించి
3. దేవస్థానములలో రజకులకు నాయి బ్రాహ్మణ మాదిరిగా ధర్మకర్త పదవులు కేటాయింపు గురించి
4. ప్రభుత్వ హాస్టల్లో దోబీ పోస్టులు కేటాయించాలి
5. రజక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు. దాడులు ఆపుటకై దక్షిణ చట్టం అమలు చేయాలి
పై సమస్యలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ద్వారా మన నాయకులు గౌ” శ్రీమతి గళ్ళ మాధవి గారు గౌ ” శ్రీ దువ్వారపు రామారావు గార్ల ద్వారా ప్రస్తుతం వారి పదవుల ద్వారా గౌ” ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరగా పరిష్కారం చేసుకునే అవకాశం కలదు.
కావున మన మార్కాపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి అన్ని మండలాల నుండి మరియు అన్ని గ్రామాల నుండి రజకులు వేలాదిగా పాల్గొని మన సమస్యల గురించి ఏర్పాటు చేసిన ఈ సమావేశమును జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము
ఈ కార్యక్రమమునకు అతిథులుగా
గౌరవనీయులు. శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు. శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు. శ్రీ కొల్లు రవీంద్ర గారు. శ్రీమతి ఎస్ సవిత గారు. గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు. గౌరవనీయులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు. ముత్తుముల అశోక్ రెడ్డి గారు. ఎర్రగొండపాలెం ఇంచార్జ్ గౌరవనీయులు గూడూరు ఎరిక్షన్ బాబు గారు. గౌరవనీయులు ఇ మ్మడి కాశీనాథ్ గారు. పాల్గొంటారు
రజక సాధికార పార్లమెంట్ కమిటీ సభ్యులు గాజులపల్లి శ్రీను









