మదనపల్లి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 332 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










