నీటి పొదుపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం.|

0
2

ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అమలు, ఆరుతడి పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం విస్తరణ, మామిడి తోటల్లో అంతర పంటలు, సూక్ష్మ నీటిపారుదల పథకాల అమలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో రైతులకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.