అంగన్వాడీలకు ఎలక్ట్రిక్ స్టవ్లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం|

0
3

 

 

రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్ స్టవ్‌లు మరియు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో *తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు* పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం చేస్తోందన్నారు. *మహిళా, శిశు సంక్షేమానికి* ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

 

ప్రజలకు ఉపయోగపడే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.