“అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు”
హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు అంబులెన్స్ను విరాళంగా అందజేశారు.
ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ అంబులెన్స్ సర్వీస్ అందించిన అంబులెన్స్ను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తరఫున మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ పి. సుబ్బయ్య స్వీకరించారు. పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో అందించిన ఈ అంబులెన్స్ను కమిషనరేట్ పరిధిలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అంబులెన్స్ను విరాళంగా అందించిన తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి, లక్ష్మీ అంబులెన్స్ సర్వీస్కు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
#Sidhumaroju










