రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన అనంతరం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ సున్నపురాళ్ళపల్లె లో జే ఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి బయలుదేరు నిమిత్తం శుక్రవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న గౌ.ముఖ్యమంత్రి వర్యులకు సాగద వీడ్కోలు లభించింది.
జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యే లు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, భాను ప్రకాష్, కోనేటి ఆదిమూలం, మురళి మోహన్, ఆర్ డి ఓ భాను ప్రకాశ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు గౌ. ముఖ్యమంత్రి గారికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు..










