“చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం”
హైదరాబాద్, జూలై 5: క్రికెట్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాల సమయంలో ప్రసారమయ్యే అడల్ట్ ఉత్పత్తుల ప్రకటనలపై మరోసారి చర్చ మొదలైంది.
టీఎంసీ ఎంపీ, మాజీ భారత క్రికెటర్ కీర్తి ఆజాద్ ఈ అంశంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, చిన్నారులు కూడా మ్యాచ్లు చూస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు ప్రసారం చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
భారత్–ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ప్రసారమైన ఒక ప్రకటనను ప్రస్తావించిన ఆయన, ప్రసార సంస్థలు, ప్రకటనదారులు, సంబంధిత సంస్థలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.
చిన్నారుల మనోభావాలు, కుటుంబ ప్రేక్షకుల దృష్ట్యా ఇలాంటి ప్రకటనల ప్రసారంపై పునరాలోచన అవసరమని సూచించారు.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎంపీ అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు చట్టబద్ధంగా అనుమతించిన ఉత్పత్తుల ప్రకటనలను పూర్తిగా వ్యతిరేకించడం సరైంది కాదని అంటున్నారు. దీంతో క్రీడా ప్రసారాల్లో ప్రకటనల స్వరూపంపై మరోసారి చర్చ ప్రారంభమైంది.
–Sidhumaroju










