డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఐజీ ఆకే రవికృష్ణ|

0
3

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను శ్రీ ఆకే రవికృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రివర్యులకి వివరించారు.