“మల్కాజ్గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సమక్షంలో ప్రారంభించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్”
మేడ్చల్ మల్కాజ్గిరి జులై 6 (భారత్ ఆవాజ్):మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా సోమవారం సెక్టార్-1లోని మనసరోవర్ హైట్స్ సమీపంలోని సముద్రా సింఫనీ అపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను బేగంపేట్ డివిజన్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సమక్షంలో అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్ఐ చంద్రశేఖర్ తో పాటు సీసీటీవీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో సీసీటీవీ నెట్వర్క్ను విస్తరించడం వల్ల నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందన్నారు. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తులో మాత్రమే కాకుండా, నేరాలను ముందుగానే నిరోధించడంలో కూడా సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి అపార్ట్మెంట్, వాణిజ్య సముదాయం, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్ను మరింత ప్రజలకు చేరువ చేస్తున్నామని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, నేరాలకు పాల్పడే వ్యక్తులను వేగంగా గుర్తించడం, దర్యాప్తును సులభతరం చేయడం సాధ్యమవుతుందన్నారు. ప్రజల సహకారంతో సీసీటీవీ నెట్వర్క్ను మరింత విస్తరించే దిశగా అల్వాల్ పోలీసులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సీసీటీవీ నెట్వర్క్ విస్తరణకు సహకరించిన జూడియో మాల్ యాజమాన్యాన్ని పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేయడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్కు మరింత బలం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
#Sidhumaroju
Alwal










