ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్ ప్రతిపాదన
విశాఖ పోర్టు సమీపంలో ఎక్స్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
కొరియన్ పెట్టుబడిదారులకు 3S విధానంతో రక్షణ కవచంలా ఉంటామని భరోసా
ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, జాయింట్ ట్రెయినింగ్ అకాడమీల ఏర్పాటుకు సంసిద్ధత
ఏపీ-కొరియా ఇన్వెస్ట్మెంట్ డెస్క్ ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖకు సూచన
ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సియోల్లో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్తో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, పలు వ్యూహాత్మక ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు.










