తెలంగాణ భరత్ అవాజ్ సెంట్రల్ మీడియా ప్రతినిధి (గోయిండ్ల ప్రశాంత్ ):
2029 మే- జూన్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ‘ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182 కు చేరుతాయి. వాటిలో 117 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. భద్రాద్రి రాముడిపై ఆన…. ఇది ఖమ్మం ప్రజల మాట కెసిఆర్ కాచుకో… నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ ఎవరు వస్తారు రండి’ అని ఖమ్మం ఆశీర్వాద సభలో సవాల్ విసిరారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ కౌరవ వంశంగా మారిందని దుయ్యబట్టారు.










