మదనపల్లె: గురువారం మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు 35వ వార్డు టీడీపీ ఇంచార్జ్ రమేష్ రెడ్డి స్థానిక సచివాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదరం సేవలపై అవగాహన కల్పించి, సదరం స్లాట్ బుకింగ్ను స్వయంగా దగ్గరుండి చేయించారు.
అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించి, BLOలు, BLAలతో మాట్లాడి ఇప్పటివరకు నమోదైన పురోగతిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, BLOలు, BLA










