ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
దువ్వూరు మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన వెంకట్ అఖిల్ గారికి, అలాగే ఒంటిమిట్ట మండలానికి చెందిన కసిరు రవికుమార్ గారి కుమార్తె సిరి మాధురి చికిత్స నిమిత్తం మంజూరైన LOC లేఖలను అందజేశాము.
వారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తాము.










