మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు|

0
7

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన వారికి రక్తదాన ధృవ పత్రాలను అందజేశారు,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన క్లబ్ కమిటీ సభ్యులు అందరిని అభినందించారు, ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ సాయినీ స్రవంతి -కిషోర్ , క్లబ్ అధ్యక్షులు వెంకట రమణారావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కోశాధికారి నర్సింగరావు, ఉపాధ్యక్షులు జితేందర్ రావు, కొత్త రాజేశం, శశిపాల్ రెడ్డి, కార్యదర్శులు వడ్డే రాజమౌళి , జుర్రు నగేష్, కల్వల జగన్ మోహన్ రావు, నల్ల శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి సత్యపాల్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.