మదనపల్లెలో ఘనంగా ప్రారంభమైన విజయ భారతి క్రికెట్ అకాడమీ|

0
0

మదనపల్లె: యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ భారతి క్రికెట్ అకాడమీని శుక్రవారం కురవంకలో ఘనంగా ప్రారంభించారు. విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి అకాడమీని అధికారికంగా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించేందుకు విజయ భారతి క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

విజయభారతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ నిశ్చితా సేతు మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. యువతకు అత్యుత్తమ క్రికెట్ శిక్షణ అందించి వారి ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా అకాడమీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.